తమిళ భామ కీర్తి సురేష్ తీవ్ర ఆగ్రహంగా ఉంది , ఎప్పుడూ శాంతంగా ఉండే ఈ భామకు కోపం ఎందుకు వచ్చిందో తెలుసా …… …. సామి రీమేక్ విషయంలోనే . 2003 లో వచ్చిన సామి తమిళనాట సంచలన విజయం సాధించింది దాంతో తెలుగులో బాలకృష్ణ హీరోగా లక్ష్మీనరసింహా గా రీమేక్ చేసారు ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది . అయితే అప్పటి నుండి సామి చిత్రానికి సీక్వెల్ ఉంటుంది అని మాటలు వినబడటమే తప్ప కార్యరూపం మాత్రం దాల్చలేదు అయితే ఇన్నాళ్లకు అది కుదిరింది .
అయితే సీక్వెల్ సినిమాలో మొదట త్రిష ని హీరోయిన్ గా ఎంపిక చేసారు కట్ చేస్తే ఇప్పుడు త్రిష ఆ సినిమా నుండి తప్పుకుంది దానికి కారణం కీర్తి సురేష్ ని అసలు హీరోయిన్ గా తీసుకోవడమే అని రకరకాల పుకార్లు రావడంతో త్రిష ఎందుకు తప్పుకుందో నాకెలా తెలుస్తుంది అలాగే నేనెలా కారణం అవుతాను అనవసరంగా నన్ను ఎందుకు ఈ వివాదంలోకి లాగుతున్నారు అంటూ మండిపడుతోంది కీర్తి సురేష్ .