`చిత్రలహరి`తో హిట్ బాట పట్టిన సాయి ధరమ్తేజ్కు `ప్రతీ రోజు పండగే` మూవీతో సాలీడ్ హిట్ని అందించాడు మారుతి. ఈ మూవీ ఇచ్చిన సక్సెస్ ఊపులో వున్న మారుతి వెంటనే మరో స్టార్ హీరోతో సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నారు. మాస్ రాజా రవితేజకు కథ వినిపించారు. కానీ కథలో పసలేకపోవడంతో మారుతితో సినిమా చేయడానికి ఆసక్తిని చూపించలేదు. దీంతో మరో హీరోని వెతుక్కునే పనిలో పడ్డారు మారుతి.
రవితేజ ఇంప్రెస్ కాకపోవడంతో మారుతి దృష్టి నందమూరి హీరో కల్యాణ్రామ్ మీద పడింది. రవితేజ తరువాత శర్వానంద్, రామ్లతో సినిమా చేయాలని ప్రయత్నాలు చేసిన మారుతి ఇటీవల నందమూరి కల్యాణ్రామ్ని సంప్రదించారట. మారుతి చెప్పిన కథ నచ్చడంతో అతనితో సినిమా చేయడానికి కల్యాణ్రామ్ సుముఖతని వ్యక్తం చేశారట. కానీ ఈ మూవీని తాను డైరెక్ట్ చేయనని, కథ, స్క్రిన్ప్లే మాత్రమే అందిస్తానని, మరో దర్శకుడు ఈ మూవీని చేస్తాడని ఓ ప్రపోజల్ పెట్టారట.
దానికి కల్యాణ్రామ్ అంగీకరించలేదని, మారుతి ప్రజోజల్ని సున్నితంగా తిరస్కరించారని తెలిసింది. కల్యాణ్రామ్ ప్రస్తుతం వేణు మల్లిడి దర్శకత్వంలో ఓ పిరియాడిక్ ఫిల్మ్ చేస్తున్నారు. కొంత షూటింగ్ కూడా జరిగింది. కరోనా నేపథ్యంలో చిత్రీకరణని నిలిపివేశారు.