Homeటాప్ స్టోరీస్నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ హీరోగా మైత్రీ మూవీమేక‌ర్స్ చిత్రం!

నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ హీరోగా మైత్రీ మూవీమేక‌ర్స్ చిత్రం!

నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ హీరోగా మైత్రీ మూవీమేక‌ర్స్ చిత్రం!
నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ హీరోగా మైత్రీ మూవీమేక‌ర్స్ చిత్రం!

స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ చిత్రం `118`తో మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న హీరో నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ కొంత విరామం త‌రువాత మ‌రో చిత్రాన్ని మొద‌లుపెట్టారు. ఆయ‌న హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, వై. ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమ‌వారం హైద‌రాబాద్‌లోని సంస్థ కార్యాల‌యంలో ఈ మూవీ లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది.

ఈ చిత్రం ద్వారా రాజేంద్ర ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. క‌ల్యాణ్‌రామ్ న‌టిస్తున్న 19వ చ‌యిత్ర‌మిది. మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌లో 14వ చిత్రిమ‌ది. పూజా కార్య‌క్ర‌మాల అనంత‌రం చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి `ఉప్పెన‌` ఫేమ్ బుచ్చిబాబు సానా క్లాప్ నిచ్చారు. ద‌ర్శ‌కులు భ‌ర‌త్ క‌మ్మ‌, రాధాకృష్ణ‌కుమార్ సంయుక్తంగా కెమెరా స్విఛాన్ చేశారు.

- Advertisement -

హీరో క‌ల్యాణ్‌రామ్‌, నిర్మాత న‌వీన్ ఎర్నేని, సీఈవో చెర్రీ.. చిత్ర ద‌ర్శ‌కుడు రాజేంద్ర‌కు స్క్రిప్ట్ అంద‌జేశారు.
మార్చి రెండ‌వ వారం నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింట్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో న‌టించే హీరోయిన్‌తో పాటు ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల్ని త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం` అని నిర్మాతలు తెలిపారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All