టాలీవుడ్లో మునుపెన్నడూ లేని విధంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. కరోనా ప్రబలుతున్నా టాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లి విషయంలో ఏమాత్రం వెనక్కుతగ్గడం లేదు. అత్యంత సన్నిహితులు వున్నా చాలు వారి మధ్యే వివాహం చేసుకుంటామని కొంత మంది చేసి చూపిస్తున్నారు. కొంత మంది నితిన్ లాంటి వాళ్లు వేచి చూడాలనుకున్నా వరుసగా మిగతా స్టార్స్ వివాహం చేసుకుంటుండటంతో నితిన్ కూడా ఇటీవల సింపుల్గానే వెడ్డింగ్ తంతుని పూర్తి చేసుకుని ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే అందాల చందమామ కాజల్ కూడా పెళ్లికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే సీక్రెట్గా కాజల్ అగర్వాల్ ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అత్యంత సన్నిహిత వర్గాలు సమాచారం ఏంటంటే గౌమ్ అనే వ్యక్తితో అత్యంత సీక్రెట్గా కాజల్ అగర్వాల్ నిశ్చితార్థం జరిగిందని చెబుతున్నారు. ఈ విషయాన్ని కాజల్ తల్లిదండ్రులు అత్యంత గోప్యంగా వుంచాలని ప్లాన్ చేశారట.
ఈ సీక్రెస్ ఎంగేజ్మెంట్కు టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హాజరైనట్టు తెలిసింది. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ కలిసి సీత, కవచం చిత్రాల్లో నటించారు. ఆ తరువాత నుంచి ఈ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పూడిందట.దాని కారణంగానే బెల్లంకొండ శ్రీనివాస్ ని కాజల్ తన ఎంగేజ్మెంట్కి ఆహ్వానించిందని చెబుతున్నారు. ఇది ఎంత వరకు నిజమన్నది తెలియాలంటే స్వయంగా కాజల్ క్లారిటీ ఇవ్వాల్సిందే.