టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యం కారణంగా అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వెంటిలేటర్ మీద ఆయన చికిత్స జరుగుతుందని సమాచారం. అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కైకాల సత్యనారయణ గురించి మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇవి వారి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే ఆయన ఆరోగ్యంపై వివరణ ఇచ్చారు కైకాల సత్యనారాయణ కూతురు రమాదేవి.
ప్రస్తుతం నాన్న గారి ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఆయన స్ప్రుహలోకి వచ్చారని. తమతో మాట్లాడుతున్నారని అన్నారు రమాదేవి. నాన్న గారు క్రమంగా కోలుకుంటున్నారు. ట్రీట్ మెంట్ కి స్పందిస్తున్నారు. అందరితో మాట్లాడుతున్నారు.. ఆయన ఆరోగ్యంపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని ఆమె అన్నారు.
తెలుగు సినిమా చరిత్రలో నటుడిగా కైకాల సత్యనారయణ ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి మెప్పించారు. విలన్ గా.. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా.. కమెడియన్ గా కైకాల తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఆయన అనారోగ్య పరిస్థితి గురించి మీడియాలో వార్తలపై ఆయన కూతురు పైవిధంగా స్పందించారు.