సినిమా విడుదలైన రోజునే 20 కోట్ల వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది కబీర్ సింగ్ చిత్రం . తెలుగులో ప్రభంజనం సృష్టించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే . షాహిద్ కపూర్ – కియారా అద్వానీ జంటగా నటించగా సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు . నిన్న భారీ ఎత్తున విడుదలైన కబీర్ సింగ్ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల షేర్ లభించింది .
మొదటి రోజునే 20 కోట్ల షేర్ రావడంతో అవలీలగా 100 కోట్లకు పైగా ఈ సినిమా భారీ విజయం సాధించడం ఖాయమని నమ్ముతున్నారు . ఇక ఈ సినిమా ఇలా విడుదల అయ్యిందో లేదో అలా తమిళ రాకర్స్ కబీర్ సింగ్ చిత్రాన్ని లీక్ చేసి ఆన్ లైన్ లో పెట్టేసారు . ఇలా లీక్ కావడం వల్ల కొంత కలెక్షన్ల పరంగా ఇబ్బంది ఎదురు అవ్వడం ఖాయం కబీర్ సింగ్ చిత్రానికి . అయితే ఈ సినిమాకు యువత బ్రహ్మరథం పడుతుండగా కొంతమంది మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్టున్నారు బి గ్రేడ్ సినిమా అని .