ఇటీవల జ్యోతిక నటించిన సినిమా `పొన్ మగళ్ వందాల్` చిత్రం కారణంగా హీరో సూర్య వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా లాక్డౌన్ కారణంగా ఓటీటీ ప్లాట్ ఫామ్లో రిలీజ్ చేయడానికి సూర్య సిద్ధమైన విషయం తెలిసిందే. అలా ఎట్టిపరిస్థితుల్లో చేయడానికి వీలు లేదని తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం సూర్య బ్యానర్లో నిర్మించే చిత్రాలని తమ థియేటర్లలో బ్యాన్ చేస్తున్న మంటూ వివాదానికి తెరలేపిన విషయం తెలిసిందే.
తాజాగా జ్యోతిక కారణంగా మరో వివాదం మొదలైంది. ఇటీవల జ్యోతిక `ఆలయాలతో సమానంగా పాఠశాలల్ని, ఆసుపత్రులను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం వుందని వ్యాఖ్యానించింది. దీనిపై తాజాగా వివాదం మొదలైంది. కొంత మంది జ్యోతిక వ్యాఖ్యాల్ని తప్పుపడుతుంటే.. మరి కొంత మంది వివాదం చేస్తున్నారు. తాజాగా దీనిపై హీరో సూర్య క్లారిటీ ఇచ్చారు. జ్యోతిక చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి వున్నానని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాకు `చెట్టు ఊరుకున్నా గాలి వదిలి పెట్టేలా లేదు` అనే సామెత సరిగ్గా సరిపోతుంది. ఎప్పుడో ఓ అవార్డు ఫంక్షన్లో జ్యోతిక అన్న మాటల్ని ఈ లాక్డౌన్ వేళ వివాదం చేస్తున్నారని, సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యల్ని ప్రత్యేకంగా చిత్రిస్తూ వివాదం చేస్తున్నారని సూర్య వెల్లడించారు.