Homeటాప్ స్టోరీస్ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన ఎన్టీఆర్

ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అభిమానులకు షాక్ ఇచ్చాడు . జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20 దాంతో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించాలని ప్లాన్ చేసారు . అయితే ఈ విషయం ఎన్టీఆర్ కు తెలియడంతో ఎలాంటి వేడుకలు జరపొద్దని తన అభిమానులకు ఆదేశాలు జారీ చేసాడట ! దాంతో షాక్ అయ్యారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ . అయితే ఎన్టీఆర్ ఇలా అభిమానులకు షాక్ ఇవ్వడానికి కారణం తండ్రి హరికృష్ణ మరణమే !

- Advertisement -

తండ్రి హరికృష్ణ ఓ పెళ్లి వేడుక కోసం రోడ్డు ప్రయాణం చేస్తూ యాక్సిడెంట్ కు గురై చనిపోయిన విషయం తెలిసిందే . దాంతో తండ్రి మరణించి ఏడాది కాకుండానే జన్మదిన వేడుకలు చేసుకోవడం ఇష్టం లేదు జూనియర్ ఎన్టీఆర్ అందుకే ఈ తాఖీదు ఇచ్చారట . అయితే ఎన్టీఆర్ మనోగతం ఎలా ఉన్నప్పటికీ కొంతమంది అభిమానులు అయితే అస్సలు ఆగడం లేదు యధావిధిగా ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు చేయడమే అని పట్టుబడుతున్నారట .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All