అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ” మిస్టర్ మజ్ను ” చిత్రం ఈనెల 25 న విడుదల అవుతున్న నేపథ్యంలో ఈనెల 19 న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ ఎత్తున చేయడానికి రంగం సిద్ధం చేసారు . ఆ వేడుకకు ముఖ్య అథితి గా జూనియర్ ఎన్టీఆర్ ని పిలిచారు , ఎన్టీఆర్ కూడా ఆనందంగా ఒప్పుకున్నాడు …….. వస్తున్నాడు . ఎన్టీఆర్ వస్తున్నాడు సరే అఖిల్ ఈ సినిమాతోనైనా హిట్ కొడతాడా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది .
అఖిల్ సోలో హీరోగా నటించిన అఖిల్ డిజాస్టర్ కాగా , హలో ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు . దాంతో తొలిప్రేమ చిత్రంతో సక్సెస్ కొట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ మిస్టర్ మజ్ను అనే సినిమా చేస్తున్నాడు అఖిల్ . జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా రావడం అంటే సినిమాపై కాస్త అంచనాలు పెంచడమే అయితే సినిమాలో కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు …… లేదంటే షరా మాములే !
English Title: Jr NTR chief guest for Akhil