జనగణమన టీం బుధువారం సాయంత్రం ఢిల్లీ లో రాజ్నాథ్ సింగ్ ను కలిశారు. నిన్న డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ‘జేజీఎం’ (జన గణ మన) చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చేస్తున్న ‘లైగర్’ చిత్ర హీరో విజయ్ దేవరకొండతోనే ఈ చిత్రాన్ని ఆయన చేయబోతున్నట్లుగా తెలిపారు. ఈ చిత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పూరీ ఎప్పటి నుండో చెబుతూ వస్తున్నారు.
టాలీవుడ్లోని స్టార్ హీరోలెందరినో ఈ ప్రాజెక్ట్కి పూరి సంప్రదించారు. ఫైనల్గా విజయ్తోనే ఈ చిత్రాన్ని పూరీ తెరకెక్కించబోతున్నారు. దేశభక్తి నేపథ్యంలో సాగే కథతో రూపుదిద్దుకోనున్న ఈఈ చిత్రానికి దర్శకుడు వంశీ పైడిపల్లి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని నెక్ట్స్ ఇయర్ ఆగస్ట్ 3న రిలీజ్ చెయ్యబోతున్నట్టు కూడా అనౌన్స్ చేసేశారు. ఈ తరుణంలో బుధువారం సాయంత్రం చిత్ర యూనిట్ రాజ్నాథ్ సింగ్ ను కలిసి సినిమా విశేషాలు పంచుకున్నట్లు తెలుస్తుంది.
Team #JGM meets honourable Defence minister of India , Shri @rajnathsingh ji at Delhi Last evening !!@TheDeverakonda #PuriJagannadh @Charmmeofficial @PuriConnects #RamuRaoJupally#SrikaraStudios @IamVishuReddy pic.twitter.com/SYOHdURnbA
— BA Raju's Team (@baraju_SuperHit) March 31, 2022