అతిలోకసుందరి శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ ఇప్పటికే బాలీవుడ్ లో హీరోయిన్ గా స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే తల్లి బాటలోనే సౌత్ సినిమాల మీద ఫోకస్ చేయాలని చూస్తుంది జాన్వి కపూర్. ముఖ్యంగా తెలుగు సినిమాల మీద జాన్వి కపూర్ మాసక్తి చూపిస్తుందని తెలుస్తుంది. ఇక్కడ సరైన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న అమ్మడు ఓ సినిమాకు సైన్ చేసిందని టాక్.
జాన్వి కపూర్ తెలుగులో ఎన్.టి.ఆర్ సినిమాకు ఓకే చెప్పిందని అంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా కియరా అద్వానిని అనుకున్నారు కాని ఆమె చరణ్, శంకర్ సినిమాకు ఓకే చెప్పింది. అందుకే జాన్వి కపూర్ ను ఈ సినిమాలో నటింపచేయాలని అనుకుంటున్నారు. తప్పకుండా జాన్వికి ఇది గ్రాండ్ ఎంట్రీ అవుతుందని చెప్పొచ్చు.
తెలుగులో మంచి అవకాశం కోసం చూస్తున్న జాన్వి కపూర్ విజయ్ దేవరకొండ, మహేష్ సినిమాల ఛాన్సుల కోసం వెయిట్ చేస్తుందని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మిగతా హీరోలను కవర్ చేయాలని చూస్తుంది అమ్మడు.