టాలీవుడ్లో అత్యంత ఫాస్టెంస్ట్ ఫిల్మ్ మేకర్ వర్మ తరువాత ఎవరైనా వున్నారంటే అది పూరి జగన్నాథ్ ఒక్కరే. స్పీడుగా తక్కువ రోజుల్లో సినిమాల్ని తెరకెక్కించి బ్లాక్ బస్టర్లుగా మలిచే ఈ దర్శకుడికి ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ వుంది. అదే `జన గణ మన`. ఈ చిత్రాన్ని మహేష్ బాబుతో తెరకెక్కించాలని విశ్వప్రయత్నాలు చేశారు. కానీ వర్కవుట్ కాలేదు. ఆ తరువాత పూరీ దీన్ని పక్కన పెట్టేశారంటూ వార్తలు వినిపించాయి.
తాజాగా తన డ్రీమ్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఆప్డేట్ని స్వయంగా పూరి జగన్నాథ్ మంగళవారం సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. `జన గణ మన` నా డ్రీమ్ ప్రాజెక్ట్. అతి త్రలోనే ఈ చిత్రాన్ని ప్రారంభించబోతున్నాను` అని పూరీ ప్రకటించడటం ఆసక్తికరంగా మారింది. `ఖచ్చితంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తాను. ఇది పాన్ ఇండియా స్థాయి కథ` అని పూరీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఏ స్థాయిలో వుండబోతుందో స్పష్టం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని చార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతాతో కలిసి పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. దీని తరువాతే `జన గణ మన` సెట్స్ పైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇందులో ఏ హీరో నటిస్తారు? అనేది తెలియాల్సి వుంది.