Homeటాప్ స్టోరీస్పూరీ త‌న‌ డ్రీమ్ ప్రాజెక్ట్ ప్ర‌క‌టించాడు!

పూరీ త‌న‌ డ్రీమ్ ప్రాజెక్ట్ ప్ర‌క‌టించాడు!

పూరీ త‌న‌ డ్రీమ్ ప్రాజెక్ట్ ప్ర‌క‌టించాడు!
పూరీ త‌న‌ డ్రీమ్ ప్రాజెక్ట్ ప్ర‌క‌టించాడు!

టాలీవుడ్‌లో అత్యంత ఫాస్టెంస్ట్ ఫిల్మ్ మేక‌ర్ వ‌ర్మ త‌రువాత ఎవ‌రైనా వున్నారంటే అది పూరి జ‌గ‌న్నాథ్ ఒక్క‌రే. స్పీడుగా త‌క్కువ ‌రోజుల్లో సినిమాల్ని తెర‌కెక్కించి బ్లాక్ బ‌స్ట‌ర్‌లుగా మ‌లిచే ఈ ద‌ర్శ‌కుడికి ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ వుంది. అదే `జ‌న గ‌ణ మ‌న‌`. ఈ చిత్రాన్ని మ‌హేష్ బాబుతో తెర‌కెక్కించాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. ఆ త‌రువాత పూరీ దీన్ని ప‌క్క‌న పెట్టేశారంటూ వార్త‌లు వినిపించాయి.

తాజాగా త‌న డ్రీమ్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఆప్‌డేట్‌ని స్వ‌యంగా పూరి జ‌గ‌న్నాథ్ మంగ‌ళ‌వారం సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. `జ‌న గ‌ణ మ‌న‌` నా డ్రీమ్ ప్రాజెక్ట్. అతి త్ర‌లోనే ఈ చిత్రాన్ని ప్రారంభించ‌బోతున్నాను` అని పూరీ ప్ర‌క‌టించ‌డ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. `ఖ‌చ్చితంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తాను. ఇది పాన్ ఇండియా స్థాయి క‌థ‌` అని పూరీ త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ ఏ స్థాయిలో వుండ‌బోతుందో స్ప‌ష్టం చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

- Advertisement -

ప్ర‌స్తుతం టాలీవుడ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్  ఓ భారీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని చార్మి, క‌ర‌ణ్ జోహార్‌, అపూర్వ మెహ‌తాతో క‌లిసి పూరి జ‌గ‌న్నాథ్ నిర్మిస్తున్నారు. దీని త‌రువాతే `జ‌న గ‌ణ మ‌న‌` సెట్స్ పైకి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి అయితే ఇందులో ఏ హీరో న‌టిస్తారు? అనేది తెలియాల్సి వుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All