`ఛలో` సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న కన్నడ సోయగం రష్మిక మందన్న. అనతికాలంలోనే తెలుగులో క్రేజీ కథానాయికల జాబితాలో చేరిపోయింది. వరుస క్రేజీ ఆఫర్లని సొంతం చేసుకుంటూ స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుందోంది. కథానాయికగా పరిచయమైంది కన్నడ చిత్ర పరిశ్రమలో అయినా తెలుగులో క్రేజ్ రావడంతో ఎక్కువగా తెలుగు చిత్రాలకే ప్రాధాన్యతనిస్తోంది. తాజాగా బెంగళూరులోని కొడుగు జిల్లా విరాజ్పేట్లో వున్న ఆమె ఇంటిలో గురువారం ఐటీ శాఖ అధికారులు ఆకస్మికంగా దాడులకు దిగడం కలకలం రేపుతోంది.
ఇటీవల టాలీవుడ్కు చెందిన యాంకర్లు అనసూయ, సుమల ఇళ్లతో పాటు లావణ్య, డి సురేష్బాబు, నానా ఇళ్లపై జీఎస్టీ అధికారులు దాడులు చేయడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా రష్మికను ఐటీ అధికారులు టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది. గురువారం ఉదయం వారాజ్పేట్లో వున్న రష్మిక ఇంటికి రెండు కార్లల్లో వచ్చిన ఐటీ అధికారులు ఉదయం నుంచి సోదాలు మొదలుపెట్టారు.
ఈ సోదాల్లో రష్మిక బ్యాంకుఖాతాలతో పాటు విలువైన డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఉన్నట్టుండి ఐటీ అధికారుల కన్ను రష్మిక ఇంటిపై పడటానికి ప్రధాన కారణం తెలుగు చిత్రాల ద్వారా అందుకుంటున్న పారితోషికాన్ని చాలా తక్కువగా చూపించడమే అని కన్నడ మీడియాలో వార్తలు వినిపిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం నితిన్ నటిస్తున్న `భీష్మ`తో పాటు అల్లు అర్జున్, సుకుమార్ల చిత్రాల్లో నటిస్తోంది. రష్మిక నటించిన తాజా చిత్రం `సరిలేరు నీకెవ్వరు` ఈ సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే.