బిగ్బాస్ సీజన్ 3కి భారీ క్రేజ్ రావడం.. టీఆర్పీ రికార్డు స్థాయిలో నమోదు కావడంతో సీజన్ 4పై సర్వత్రా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే కరోనా కారణంగా బిగ్బాస్ మేకర్స్ ఎవరూ ఊహించని కంటెస్టెంట్లని సీజన్ 4కు ఎంపిక చేయడంతో ఈ సీన్ ఎలా వుంటుందో అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే కరోనా కారణంగా వినోదానికి పెద్ద వెలితి ఏర్పడటంతో సీజన్ 4పై వినోద ప్రేమికులు ఆధారపడటం మొదలైంది.
దీంతో ఈ సీజన్కు భారీ స్థాయిలో టీర్పీ రేటింగ్స్ రావడం ఖాయమనే సంకేతాలు వినిపించాయి. దీంతో సీజన్ 4 భారీ అంచనాలతో మొదలైంది. తొలి వారం భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్స్ నమోదు కావడం చాలా మందిని విస్మయానికి గురిచేసింది. ఎలాంటి సెలబ్రిటీస్ లేని సీజన్ 4 దేశ వ్యాప్తంగా రేటింగ్లో సంచలనం సృష్టించిందని స్వయంగా నాగార్జున చెప్పగం గమనార్హం.
అయితే రెండవ వారినికి అది దారుణంగా పడిపోవడం షాకిస్తోంది. 4.5 కోట్ల మంది తొలి వారం వీక్షించారని ప్రకటించారు. ఇది బిగ్బాస్ సీజన్లకి రికార్డుగా నిలిచింది. 18.5 రేటింగ్ వచ్చింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వున్న తెలుగు వాళ్లలో ప్రతీ 3 మందికి ఇద్దరు ఈ షోని చూస్తున్నారని తెలిసింది. గత సీజన్తో పోలిస్తే ఇది రికార్డ్ అని నాగార్జున చెప్పారు. అయితే తాజాగా దీని రేటింగ్ భారీగా తగ్గడం మేకర్స్ని ఆలోచనలో పడేసింది. రేటింగ్ పడిపోవడానికి కారణం ఐపీఎల్ అని చెబుతున్నారు. ఇటీవలే ఐపీఎల్ ప్రారంభమైన విషయం తెలిసిందే.