అక్కినేని నాగార్జున ఈ సారి బిగ్ బాస్ హోస్టింగ్ లో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. లాస్ట్ టైమ్ లో జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుని నాగార్జున ఈసారి హోస్టింగ్ విషయంలో కొత్త ఫ్లో లో వెళ్తున్నాడు. దానికి నిన్నటి ఎపిసోడ్ నిదర్శనం అని చెప్పవచ్చు. హౌస్ లో జరిగిన విషయాలను ప్రస్తావిస్తూ అందరినీ ఆడుకున్నాడు నాగ్.
నిన్నటి ఎపిసోడ్ లో ట్రూత్ గేమ్ ను హౌస్ మేట్స్ తో ఆడించాడు నాగార్జున. నామినేట్ అయిన ఏడుగురి చేత ఈ గేమ్ ఆడించాడు. ట్రూత్ గేమ్ మనకు బాగా పరిచయమైన జెంగా గేమ్ ను పోలి ఉంటుంది. ఆ టవర్ లో ఒక్కో బ్లాక్ ను ఒక్కొక్కరు తీయాల్సి ఉంది. ఆ టవర్ పడిపోకుండా కంటెస్టెంట్స్ బ్లాక్ ను తీయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నాగార్జున అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ఈ సందర్భంగా మళ్ళీ కుమార్ సాయిని టార్గెట్ చేశారు హౌస్ మేట్స్. దేవి, మెహబూబ్, హారిక కుమార్ సాయి మీద నెగటివ్ కామెంట్స్ చేసారు. ఇక మోనాల్ ను అడిగిన ప్రశ్నకు సోహైల్ అబద్దాలు చెబుతాడని అంది. ఇక అరియానా ఏమో సోహైల్ ను ఇరిటేటింగ్ పర్సన్ అని తెలిపింది.
మరోవైపు కుమార్ సాయి అభిజీత్ ను టార్గెట్ చేసాడు. తెలివిగా ఈ మ్యాటర్ లో అఖిల్ ను ఇరికించాడు. మొత్తంగా ఎపిసోడ్ భలే ఉంది.