సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రంలో హీరోయిన్ గా మొదట నటించాల్సింది ఎవరో తెలుసా …… పార్వతి నాయర్ . దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మొదట పార్వతి నాయర్ దగ్గరకు వెళ్లి కథ చెప్పాడట ! అయితే సన్నివేశాల్లో ఎక్కువగా అడల్ట్ సన్నివేశాలు ఉండటం , హీరో విజయ్ దేవరకొండ కు అంతగా పేరు లేకపోవడం వీటన్నింటికి తోడూ డైరెక్టర్ కూడా కొత్తవాడు కావడంతో చేయనని చెప్పిందట .
కట్ చేస్తే ఆ ఛాన్స్ షాలిని పాండే ని వరించింది ఇంకేముంది అర్జున్ రెడ్డి సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే . అర్జున్ రెడ్డి సంచలన విజయం సాధించడంతో పార్వతి నాయర్ సినిమా చూసిందట ! సినిమా చూసాక చాలా బాధపడిందట . ఇంతటి సంచలన విజయాన్ని ఎలా వదులుకున్నాను అంటూ తెగ ఫీల్ అవుతోంది ఈ భామ . తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయాలను చెప్పింది పార్వతి నాయర్ .
- Advertisement -