జోడీ చిత్ర వివాదంలో నాకు పెద్దగా ఏమి తెలియదని , ఇద్దరు ఎన్నారై ల మధ్య గొడవ జరుగుతోందని అది పూర్తిగా క్లారిటీ ఉంది కేవలం దర్శకుడికి మాత్రమే అంటూ చాలా సింపుల్ గా చెప్పాడు హీరో ఆది సాయి కుమార్ . ఈ యంగ్ హీరో తాజాగా నటించిన చిత్రం బుర్రకథ . ప్రముఖ రచయిత డైమండ్ రత్నం ఈ బుర్రకథ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు . ఈనెల 28 న బుర్రకథ విడుదలకు సిద్దమైన నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన ఆది బుర్రకథ చిత్ర విశేషాలను వెల్లడించాడు .
అభి – రామ్ పాత్రలను బాగా ఎంజాయ్ చేసి చేసానని రేపు ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని విశ్వాసం వ్యక్తం చేసాడు . ప్రేక్షకులు కొత్తతరహా చిత్రాలను ఆదరిస్తున్నారని అలాగే మా బుర్రకథ కూడా కొత్తతరహా చిత్రమని దాంతో తప్పకుండా విజయం సాధిస్తామనే ధీమా ఉందని అంటున్నాడు . ఇక జోడీ చిత్రంలో ఇద్దరు మహిళా నిర్మాతలు సినిమా మాదంటే మాదని గొడవ పడుతున్నారు . కేసుల వరకు వెళ్ళింది వ్యవహారం కానీ ఆది మాత్రం సింపుల్ గా ఆ వివాదం గురించి నాకు పెద్దగా తెలియదు అంటూ చెప్పేసాడు .