బాహుబలి తో తన ఖ్యాతి ని ప్రపంచ వ్యాపితం చేసుకున్న దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తాజాగా ఎన్టీఆర్ – చరణ్ లతో భారీ మల్టీస్టారర్ చిత్రం చేయనున్న విషయం తెలిసిందే . గతకొంత కాలంగా రాజమౌళి ఆ సినిమా స్క్రిప్ట్ పైనే ఉన్నాడు ఇక ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేస్తున్న సెట్ పైనే అతడి దృష్టి అంతా ఉంది . రాజమౌళి ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాడట ! సినిమా ఎప్పుడో అక్టోబర్ లో కదా ప్రారంభం అయ్యేది మరి ఇప్పుడే సెట్స్ వేయడం ఏంటి ? అని అనుకుంటున్నారా ?
అక్టోబర్ లో ఎన్టీఆర్ – చరణ్ ల సినిమా అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతుంది కాబట్టి భారీ సెట్ వేస్తున్నారట ! అక్కడ యాక్షన్ దృశ్యాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న . డివివి దానయ్య నిర్మించనున్న ఈ చిత్రం మల్టీ స్టారర్ చిత్రాల్లోనే మైలురాయి గా నిలిచిపోవాలని భావిస్తున్నాడు జక్కన్న . పైగా బాహుబలి సిరీస్ లలో వచ్చిన రెండు చిత్రాల తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి .