యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని ఘోరంగా మోసం చేసారు . ప్రభుత్వ భూమిని మాదే అంటూ అమ్మడంతో ప్రభాస్ కూడా మిగతా డాక్యుమెంట్లు చూడకుండా లీగల్ గా అవి సరైనవేనా అని తెలుసుకోకుండా భారీ మొత్తం వెచ్చించి భూమిని ని కొనడమే కాకుండా అధునాతనమైన గెస్ట్ హౌజ్ ని కట్టుకున్నాడు . భూమి విలువ , కట్టడం మొత్తం కలిసి పది కోట్ల నుండి 15 కోట్ల పైచిలుకు అన్నట్లుగా తెలుస్తోంది . ఇంత మొత్తాన్ని ప్రభాస్ దాదాపుగా నష్టపోయినట్లేనా ? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది .
కోర్టు తీర్పు ప్రకారం ప్రభాస్ గెస్ట్ హౌజ్ ని కూల్చేస్తే ……. భారీ మొత్తం లో నష్టపోయినట్లే ! అయితే ఒకవేళ ప్రభుత్వం చూసి చూడనట్లుగా ఉండి రెగ్యులరైజ్ చేస్తే మాత్రం బయట పడతాడు లేదంటే మొత్తం నష్టపోయినట్లే . అయితే చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ కొంతమందికి చుట్టాలు అవుతుంటాయి కాబట్టి ఆ రకంగా చూస్తే ప్రభాస్ ఒడ్డున పడతాడేమో …… అంటే కొద్దిరోజులు చూస్తే కానీ తెలీదు . ప్రస్తుతానికైతే ప్రభాస్ మోసపోయాడు .
English Title: Huge loss for Prabhas