రాంచరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ చిత్రానికి భారీ డిమాండ్ ఏర్పడింది. మాస్ దర్శకులు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కావడం కూడా కలిసి వచ్చింది. చరణ్ నటించిన రంగస్థలం బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే, ఆ సినిమా తర్వాత చరణ్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాని కొనుక్కోవడానికి బయ్యర్లు పోటీ పడుతున్నారు.
హిందీ శాటిలైట్ , డబ్బింగ్ రైట్స్ రూపంలో ఇప్పటికే ఈ సినిమాకు 24 కోట్లకు పైగా డబ్బు ముట్టింది. అలాగే తెలంగాణ లో 24 కోట్లు పలికింది. ఇక మిగతా ఏరియాలలో కూడా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. చరణ్ సరసన కైరా అద్వానీ నటిస్తున్న ఈ చిత్రాన్ని 2019 జనవరి లో సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు కాగా డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
English Title: Huge demond for charan’s vinaya vidheya rama