90 వ దశకంలో టాలీవుడ్ లో అలాగే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన భామ దివ్యభారతి . అయితే 1993 ఏప్రిల్ 5 న 19 వ ఏటనే అర్దాంతరంగా దివ్యభారతి చనిపోయింది దాంతో ఆమె మరణంపై పలు అనుమానాలు నెలకొన్నాయి . మద్యం మత్తులో జారిపడిందని , కాదు కాదు ఆమెని చంపేశారని , ఆత్మహత్య చేసుకుందని ఇలా రకరకాల కథనాలు వినిపించాయి .
అయితే తాజాగా దివ్యభారతి మరణం పట్ల స్పందించాడు ఆమె తండ్రి . దివ్యభారతి మరణం పట్ల ఎలాంటి అనుమానాలు లేవని , బిల్డింగ్ పై నుండి జారిపడటం వల్లే చనిపోయిందని ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకున్నాడు ఓం ప్రకాష్ భారతి . ఆరోజు నీతా లుల్లా తో పాటు ఆమె భర్త కూడా వచ్చాడని మద్యం తాగారని ఆ సమయంలో మా బాల్కనీ కి గ్రిల్ లేకపోవడంతో జారి కిందపడిందని అంతేకాని మరో రకమైన విషాదం కాదు అంటూ వివరించాడు దివ్యభారతి తండ్రి ఓం ప్రకాష్ భారతి . తెలుగులో చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ తదితర హీరోలతో నటించింది దివ్యభారతి .
English Title: How Divya bharati spent the last day