Homeఎక్స్ క్లూసివ్బాలయ్య కు కోర్టు నోటీసులు

బాలయ్య కు కోర్టు నోటీసులు

Hicourt summons to Balakrishnaహీరో నందమూరి బాలకృష్ణకు కోర్టు నోటీసులు జారీ చేసింది . ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారని , ఎన్నికల ప్రచారంలో డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయారని బాలయ్య పై ఆరోపణలు రాగా వాటికీ సమాధానం చెప్పాలని హై కోర్టు నోటీసులు జారీ చేసింది . గత ఎన్నికల్లో బాలయ్య హిందూపురం  అసెంబ్లీ స్థానం నుండి పోటీచేసి గెలిచిన విషయం తెలిసిందే .

 

- Advertisement -

2017 లో నంద్యాల ఉప ఎన్నిక జరుగగా ఆ ఎన్నికల సందర్బంగా ప్రచారం చేసిన బాలయ్య బహిరంగంగా ఓటర్లకు డబ్బులు పంచుతూ ఫోటోలకు దొరికిపోయాడు . దాంతో వై ఎస్ కాంగ్రెస్ పార్టీ కోర్టుని ఆశ్రయించగా బాలయ్య కు నోటీసులు జారీ చేసింది . అయితే తదుపరి విచారణకు నెల రోజుల వ్యవధి ఇచ్చింది . బాలయ్య తో పాటుగా కేంద్ర ఎన్నికల సంఘం కు కూడా నోటీసులు జారి చేసింది కోర్టు . బాలయ్య ఎన్నికైన తర్వాత ఇచ్చిన ప్రమాణ పత్రాన్ని కోర్టుకి సమర్పించవలసిందిగా ఆదేశించింది .

 

English Title: Hicourt summons to Balakrishna

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All