కరోనా మహమ్మారి ఏ క్షణాన భారత్లోకి ఎంటరయ్యిందో కానీ చాలా మందికి ఇదొక పబ్లిసిటీ కి కేరాఫ్ అడ్రస్గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా కోరోనా విళయతాండవం చేస్తుంటే కొంత మంది సామజిక సేవ పేరుతో ఫొటోలకు పోజులివ్వడం ఎక్కువైపోయింది. రెండు టామోటాలు, నాలుగు వంకాయలు, ఐదు బెండకాయలు కవర్లో పెట్టేసి పంచేస్తూ పబ్లిసిటీ చేసుకుంటున్నారు.
సెలబ్రిటీల దగ్గరి నుంచి సామాన్యుల వరకు ఇదొక జాడ్యంగా మారింది. కరోనా సంగతి దేవుడెరుగు కరోనా పేరుతో సామాజక సేవ ముసుగులో పేదలకు వస్తువులు పంచుతూ ఫొటోలకు పోజులిచ్చేవారి సంఖ్య రోజు రోజుకీ ఎక్కువవుతోంది. అయితే తను చేసే సాయం పొందేవారికి తప్ప మూడో కంటికి తెలియకుండా సాయం చేస్తున్న వారు కూడా వున్నారు. అందులో ప్రధమంగా వినిపిస్తున్న పేరు ఎస్.ఎస్. రాజమౌళి.
షూటింగ్లు ఆగిపోవడంతో నిత్యావసర వస్తుల కోసం ఇబ్బందిపడబుతున్న ఇండస్ట్రీ కార్మికుల్లో దాదాపు 300 పైచిలుకు మందికి గత రెండు నెలలుగా నిత్యావసరాలు అందిస్తున్నారు. అయితే తను చేస్తున్న సాయాన్ని మాత్రం పబ్లిక్ తెలియకుండా చేస్తున్నారు. ఎలాంటి పబ్లిసిటీని కోరుకోవడం లేదు. ఈ విషయం తెలిసిన చాలా మంది హ్యాట్సాఫ్ టు యు రాజమౌళి సర్ అంటున్నారు.
రాజమౌళి ప్రస్తుతం మెగాపవర్స్టార్ రామ్చరణ్, యంగ్టైగర్ ఎన్టీఆర్లతో భారీ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్`ని తెరకెక్కిస్తున్నారు. 70 శాతం చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది.