మంత్రి వర్గ కూర్పుపై సీఎం మంగళవారం రాత్రి నుంచి కసరత్తు ప్రారంభించారు. సన్నిహితులతో సమావేశమై చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. నలుగురు మంత్రులు ఓడిపోయినందున, వీరి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేసుకోవడంతోపాటు ప్రస్తుతం ఉన్న వారిలో కొందరిని మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
కొత్త మంత్రులుగా కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి), బాల్కసుమన్ (చెన్నూరు), నోముల నర్సింహయ్య (నాగార్జునసాగర్), సింగిరెడ్డి నిరంజన్రెడ్డి (వనపర్తి), దాస్యం వినయ్భాస్కర్ (వరంగల్ తూర్పు), శ్రీనివాస్గౌడ్ (మహబూబ్నగర్), రేఖానాయక్ (ఖానాపూర్), పద్మాదేవేందర్రెడ్డి(మెదక్), ఎర్రబెల్లి దయాకర్రావు (పాలకుర్తి), వేముల ప్రశాంత్రెడ్డి (బాల్కొండ), మాధవరం కృష్ణారావు (కూకట్పల్లి) పేర్లు వినిపిస్తున్నాయి. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డికి కూడా మంత్రిపదవి ఇస్తారనే అంచనాలున్నాయి.
English Title: Gossip on KCR cabinet