మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ `క్రాక్`. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవల సంక్రాంతి రేసులో విజేతగా నిలిచి బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఒంగోలులో జరిగిన యదార్థ సంఘటనలకు కమర్షయల్ హంగుల్ని జోడించి గోపీచంద్ తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
ఈ మూవీ తరువాత మెగాస్టార్ అభినందనల్ని అందుకున్న గోపీచంద్ మలినేని బంపర్ ఆఫర్ని సొంతం చేసుకున్నారని, నందమూరి బాలకృష్ణతో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు. ఇటీవల `ఉప్పెన` మూవీ ప్రమోషన్లో భాగంగా మీడియాతో ముచ్చటించిన మైత్రీ మూవీమేకర్స్ అథినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ ప్రాజెక్ట్పై స్పందించారు.
బాలయ్య- గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తమ బ్యానర్పై ఓ భారీ సినిమా రానున్న విషయం నిజమేనన్నారు. ప్రస్తుతం గోపీచంద్ ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ పనిలో వున్నారని, బాలయ్య- బోయపాటి మూవీ పూర్తవగానే మా సినిమా పట్టలెక్కుతుందని స్పష్టం చేశారు.