Homeటాప్ స్టోరీస్ఇండియా, పాకిస్థాన్ బోర్డర్ లో గోపీచంద్ చిత్రం షూటింగ్ ప్రారంభం..!!

ఇండియా, పాకిస్థాన్ బోర్డర్ లో గోపీచంద్ చిత్రం షూటింగ్ ప్రారంభం..!!

Gopichand Director Thiru and AK Entertainments movie launchedయాక్ష‌న్ హీరో గోపీచంద్ కథానాయకుడుగా తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ సోమవారం ఇండియా-పాకిస్థాన్ బోర్డర్ జైసల్మేర్ లో ప్రారంభమయ్యింది.. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ భారీ ఫైట్ సీక్వెన్స్ తో మొదలవగా, యాక్షన్ డైరెక్టర్ సెల్వన్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరిస్తున్నారు.. యాభై రోజు ల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో రాజస్థాన్, న్యూ ఢిల్లీ వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరపనున్నారు.. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తుండగా, వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై ప్రొడక్షన్ నెంబర్ 18 గా అనిల్ సుంకర ఈ సినిమా ను నిర్మిస్తున్నారు.. వేసవి కానుకగా మే లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..

నటీనటులు : గోపీచంద్

- Advertisement -

సాంకేతిక నిపుణులు :
కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం: తిరు
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
బ్యానర్: ఎకే ఎంటర్టైన్మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి
సహ నిర్మాతలు: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి
రచయిత: అబ్బూరి రవి
ఆర్ట్: రమణ వంక
కో డైరెక్టర్ : దాసమ్ సాయి, రాజ్ మోహన్
పబ్లిసిటీ ఇన్ ఛార్జ్ : విశ్వా CM
పి.ఆర్.ఓ : వంశీ శేఖర్

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All