![](https://telugu.tollywood.net/wp-content/uploads/2018/02/Gopichand-25th-Film-Titled-Pantham-300x213.jpg)
నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ – “మా సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో గోపీచంద్గారి 25వ సినిమా చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాకు `పంతం` అనే టైటిల్ను నిర్ణయించాం. సినిమా అనుకున్న ప్రణాళిక ప్రకారం చిత్రీకరణను జరుపుకుంటుంది. అందులో భాగం ఇప్పటికే ఒక పాట, కొంత టాకీ పార్ట్ పూర్తయ్యింది. ఇంటర్వెల్ బ్యాంగ్లో వచ్చే యాక్షన్ సన్నివేశాలను అల్యూనిమియం ఫ్యాక్టరీలో చిత్రీకరించబడింది. మంచి మెసేజ్తో పాటు కమర్షియల్ హంగులతో సినిమాను దర్శకుడు చక్రి చక్కగా తెరకెక్కిస్తున్నారు. హీరో గోపీచంద్గారి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆయన ఎందుకోసం పంతం పట్టాడు. ఆ కారణమేంటనేది తెలుసుకోవాంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మే 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం“ అని తెలిపారు. గోపీచంద్, మెహరీన్, పృథ్వీ, జయప్రకాష్ రెడ్డి తదితరులు నటించనున్న ఈ చిత్రానికి ఆర్ట్ః ఎ.ఎస్.ప్రకాష్, డైలాగ్స్ః రమేష్ రెడ్డి, స్క్రీన్ప్లేః కె.చక్రవర్తి, బాబీ(కె.ఎస్.రవీంద్ర), కో డైరెక్టర్ః బెల్లంకొండ సత్యంబాబు, మ్యూజిక్ః గోపీసుందర్, సినిమాటోగ్రఫీః ప్రసాద్ మూరెళ్ల, నిర్మాతః కె.కె.రాధామోహన్, స్టోరీ, డైరెక్షన్ః కె.చక్రవర్తి(చక్రి).
- Advertisement -