పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ రేపు వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రానా దగ్గుబాటి ప్రతినాయకుడి పాత్రను చేస్తున్నారు. పవన్ సరసన నిత్యమీనన్ నటించగా.. రానా సరసన సంయుక్త నటించింది. తమన్ సంగీత దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ సంభాషణలు అందించారు. కాగా, ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్లతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ చిత్రానికి బెస్ట్ విషెష్ అందించారు గాడ్ ఫాదర్ మేకర్స్.
చిరంజీవి – మోహన్ రాజా కలయికలో గాడ్ ఫాదర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది మలయాళ చిత్రం ‘లూసిఫర్’కు ఇది రీమేక్. ఈ సినిమా షూటింగ్ చక చకా జరగుతోంది. పొలిటికల్ బ్యాక్డ్రాప్తో రూపొందబోయే ఈ చిత్రాన్ని చిరంజీవి ఇమేజ్కు, తెలుగు నెటివిటీకి తగినట్లు మార్చి తెరకెక్కిస్తున్నారు. సత్యదేవ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలో భీమ్లా నాయక్ మూవీ షూటింగ్ సెట్ కు చిరంజీవి హాజరై చిత్ర విశేషాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ..గాడ్ ఫాదర్ సెట్ కు వచ్చి చిరంజీవితో పాటు డైరెక్టర్ మోహన్ రాజా తో మాట్లాడి చిత్ర విశేషాలు అడిగి తెలుసుకున్నారు. పవన్ తో పాటు త్రివిక్రమ్ , నర్రా శ్రీను తదితరులు సెట్ వచ్చారు. ఈ రెండు వీడియో లను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసి భీమ్లా నాయక్ కు బెస్ట్ విషెష్ ను అందజేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
#GODFATHER and #BHEEMLANAYAK visit each other’s film sets!#BheemlaNayakOn25thFeb @KChiruTweets @PawanKalyan pic.twitter.com/oGo9XuPuax
— Ram Charan (@AlwaysRamCharan) February 24, 2022