`బొమ్మరిల్లు` చిత్రంలో హహా హాసిని అంటూ జెనీలియా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. సిద్ధార్థ్ని తనదైన నటనతో డామినేట్ చేసి అవాక్కయ్యేలా చేసింది. రానాతో కలిసి నటించిన `నా ఇష్టం` తరువాత సినిమాకు బ్రేకిచ్చి బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ని వివాహం చేసుకుంది. ఇద్దరు పాపలతో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. అయితే ఉన్నట్టుండి మళ్లీ సినిమాల్లో నటించాలని, తన కెరీర్ని దక్షిణాదిలో మళ్లీ పునః ప్రారంభించాలని గత కొన్ని నెలలుగా ప్రయత్నాలు చేస్తోంది.
తాజాగా జెనీలియాకు భలే ఛాన్స్ లభించినట్టు తెలిసింది. మలయాళంలో సూపర్స్టార్ మోహన్లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి నటించిన చిత్రం `లూసీఫర్`. ఈ చిత్రానికి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. అక్కడ ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్ర రీమేక్ హక్కుల్ని మెగాపవర్స్టార్ సొంతం చేసుకుని మెగాస్టార్ చిరంజీవితో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే.
ఈ రీమేక్ బాధ్యతల్ని `సాహో` ఫేమ్ సుజీత్కి అప్పగించారు. తెలుగు నేటీవిటీకి అనుగుణంగా మార్పులు కూడా పూర్తయ్యాయి. ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయిపోయింది కూడా. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో రాకీయాంశాలపై సెటైరికల్గా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలోని కీలకమైన సిస్టర్ పాత్ర కోసం జెనీలియాను ఎంపిక చేసుకున్నారట.ఈ పాత్రని మలయాళంలో మంజు వారియర్ నటించింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుదని తెలిసింది.