అక్కినేని నాగ చైతన్య సినిమా గురించి చాలా వెరైటీగా ఒక లీక్ వచ్చింది. అయితే చేసింది ఏ మీడియా సంస్థనో కాదు, ఒక ప్రముఖ టివి ఛానల్. ఇంకా ఆధికారికంగా ప్రకటించిన ఒక సినిమా సాటిలైట్ హక్కులు మేము తీసుకున్నామంటూ ప్రముఖ టివి ఛానల్ జెమినీ ప్రకటించింది. దాంతో అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అసలు ఈ ప్రాజెక్ట్ ఒకటి సెట్ అయిందనే చాలా మందికి తెలీదు. ఇక వివరాల్లోకి వెళితే..
దిల్ రాజు నాగ చైతన్యను జోష్ సినిమా ద్వారా లాంచ్ చేసాడు. అయితే ఆ తర్వాత ఎందుకనో వీరిద్దరూ కలిసి పనిచేయలేదు. ఇన్నాళ్ళకి వీరిద్దరూ కలిసి మళ్ళీ పనిచేయబోతున్నారు. రష్మిక మందన్న హీరోయిన్. త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. ఇంతలోనే జెమినీ టివి వారు ‘అదే నువ్వు అదే నేను” అనే టైటిల్ తో రానున్న నాగ చైతన్య – దిల్ రాజు – రష్మిక మందన్న చిత్ర సాటిలైట్ హక్కులు మేము సొంతం చేసుకున్నాం అని ట్వీట్ చేసారు. అదీ సంగతి.