Homeటాప్ స్టోరీస్గౌతమ్ మీనన్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడా?

గౌతమ్ మీనన్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడా?

Gautham Menon planning two movies
Gautham Menon planning two movies

దర్శకులలో కమర్షియల్ దర్శకులు ఒక రకం, టేస్ట్ ఉన్న సినిమాలు తీసి వాటితోనే విజయాలు అందుకునే వారు మరో రకం. గౌతమ్ మీనన్ రెండో కోవకు చెందే దర్శకుడు. తన ప్రతీ సినిమాలో ఏదొక స్పెషలిటీ ఉండేలా చూసుకుంటాడు గౌతమ్ మీనన్. చాలా సింపుల్ గా ఉండే ప్రేమ కావ్యాలు, ఆర్భాటం లేని హీరోయిజం, చాలా బలమైన హీరోయిన్ పాత్ర, అదిరిపోయే పాటలు ఇవన్నీ గౌతమ్ మీనన్ సినిమాల్లో మనకు కనిపిస్తాయి. ఘర్షణ సినిమాతో తెలుగు వారికి పరిచయమయ్యాడు గౌతమ్ మీనన్. ఆ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్. ముఖ్యంగా తమిళంలో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సూర్య, జ్యోతిక జోడికి అప్పట్లో చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. దాని తర్వాత వచ్చిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ లో గౌతమ్ మీనన్ చూపించిన సమీరా రెడ్డి పాత్ర, సూర్య పాత్రలో చూపించిన వేరియేషన్స్, ముఖ్యంగా ఎవర్ గ్రీన్ పాటలు ఇవన్నీ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. గౌతమ్ మీనన్ సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. కొన్ని చిత్రాలను కేవలం తమిళం నుండి డబ్ చేసేయడమే కాకుండా ఇక్కడ తెలుగు హీరోని పెట్టి మళ్ళీ షూట్ చేస్తుంటాడు గౌతమ్ మీనన్. ఘర్షణ, ఏం మాయ చేసావే, ఎటో వెళ్ళిపోయింది మనసు, సాహసం శ్వాసగా సాగిపో చిత్రాలు ఇలా తెరకెక్కించినవే. గౌతమ్ మీనన్ సినిమాల్లో రొమాంటిక్ యాంగిల్ సూపర్బ్ గా వర్కౌట్ అవుతుంది. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా ఎక్సెలెంట్ అని చెప్పవచ్చు.

కేవలం ప్రేమ కథలే కాకుండా యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేయడంలో గౌతమ్ మీనన్ సిద్ధహస్తుడు. రాఘవన్, ఎంతవారు గాని ఈ కోవలోకి చెందే సినిమాలే. దర్శకుడిగా అటు తమిళంలో, ఇటు తెలుగులో కూడా ఒక స్థాయి ఉన్న గౌతమ్ మీనన్ ఆఖరి చిత్రం 2016లో విడుదలైన సాహసం శ్వాసగా సాగిపో. అప్పటినుండి గౌతమ్ మీనన్ సినిమా ఏదీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. అలా అని గౌతమ్ మీనన్ ఖాళీగా ఉన్నాడని కాదు. ఈ గ్యాప్ లో రెండు సినిమాలను తెరకెక్కించాడు.

- Advertisement -

అయితే ఈ చిత్రాలకు నిర్మాత కూడా తానే అవ్వడంతో ఫైనాన్షియర్స్ తో వచ్చిన వివాదం కారణంగా తను తీసిన రెండు సినిమాలూ విడుదల కాకుండా ఆగిపోయాయి. అందులో ఒకటి ధనుష్ హీరోగా తెరకెక్కిన ఎన్నై నొక్కి పాయుం తోటా కాగా, మరొకటి విక్రమ్ హీరోగా చేసిన ధ్రువ నక్షత్రం. ఇటీవలే ఒక నిర్మాతను పట్టి ఫైనాన్షియర్స్ తో తన వివాదాల్ని పరిష్కరించుకున్న గౌతమ్ మీనన్ ఈ నెల 29న ధనుష్ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేసాడు. ఇదే సినిమా తెలుగులో తూటా పేరుతో విడుదలవుతోంది. ఇక విక్రమ్ ధ్రువ నక్షత్రాన్ని కూడా త్వరలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

తన వివాదాలు పరిష్కారం అవ్వడంతో సూర్యతో ఒక సినిమా, అనుష్క ప్రధాన పాత్రలో మరొక సినిమాను ప్లాన్ చేసాడు గౌతమ్ మీనన్. త్వరలోనే ఈ రెండిట్లో ఒక సినిమాను పట్టాలెక్కించాలని అనుకుంటున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All