Homeటాప్ స్టోరీస్మాజీ డిప్యూటీ సీఎంకు క‌రోనా పాజిటివ్‌!

మాజీ డిప్యూటీ సీఎంకు క‌రోనా పాజిటివ్‌!

మాజీ డిప్యూటీ సీఎంకు క‌రోనా పాజిటివ్‌!
మాజీ డిప్యూటీ సీఎంకు క‌రోనా పాజిటివ్‌!

తెలంగాణ ఎమ్మెల్యేల‌ని క‌రోనా వైర‌స్ వెంటాడుతోంది. ప్ర‌ధానంగా పాత వ‌రంగ‌ల్ జిల్లా నేత‌ల్ని క‌రోనా మ‌హ‌మ్మ‌రి భ‌యంతో బెంబేలెత్తేలా చేస్తోంది. జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డి ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ఆయ‌న కొడుకు, కోడ‌లుకు కూడా క‌రోనా సోకింది. వ‌రంగ‌ల్ మేయ‌ర్ గుండా ప్ర‌కాశ‌రావుకు కూడా ఇటీవ‌ల క‌రోనా పాజిటివ్ అని తేలింది. నిజామా బాద్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి, నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యేకూ.. ఆ త‌రువాత డిప్యూటి సీఎం మ‌హ‌మూద్ అలీకి,  ప‌ద్మారావుకు క‌రోనా సోక‌డం క‌ల‌క‌లం రేపింది.

తాజాగా మాజీ డిప్యూ టీ సీఎం. మాజీ విద్యాశాఖ మంత్రి క‌డియం శ్రీ‌హ‌రికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వ‌రంగ‌ల్ వాసులంతా ఒక్క‌సారిగా షాక్ కు గుర‌య్యారు. ప్ర‌స్తుతం క‌డియం శ్రీ‌హ‌రి హోమ్ ఐసోలేష‌న్‌లో వుండి చికిత్సై పొందుతున్నారు. క‌డియంతో పాటు ఆయ‌న గ‌న్‌మెన్‌, పీఏకూ క‌రోనా సోకిన‌ట్టు నిర్ధార‌ణ అయ్యింది. డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో హోమ్ ఐసోలేష‌న్‌లో వుంటూ క‌డియం చికిత్స పొందుతున్నారు. ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని తెలిసింది.

- Advertisement -

తెలంగాణ లో ప్ర‌తి ప‌క్ష‌, అధికార పార్టీకి చెందిన నాయ‌కులంతా ఇలా కోవిడ్ బారిన ప‌డుతుండ‌టం, ప్రైట్ ఆసుప‌త్రులు సామాన్యులు వెళితే ల‌క్ష‌ల్లో బిల్లులు వ‌సూలు చేస్తుండ‌టం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనిపై సీరియ‌స్ అయిన రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళి‌సై సౌంద‌ర‌రాజ‌న్ రాష్ట్ర ఆరోగ్య శాక‌తో పాటు సీఎస్‌ని వివ‌ర‌ణ కోరిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All