ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ (57) కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. ఒకరు ఆస్ట్రేలియాలో వున్నారు. మరొకరు యూఎస్లో వుండటం వలన వారు రావడానికి సమయం పడుతుందని హరికిషన్ మృత దేహాన్ని మార్చురీకి తరలించారు.
మిమిక్రీ కారణంగా ఆయనకు సినీ రంగంతోనూ మంచి అనుబమంధం ఏర్పడింది. కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు. 1963 మే 30న ఏలూరులోని రంగమణి, వీఎల్ ఎన్ ఆచార్యులు దంపతులకు జన్మించారు. సినిమా ఈ వెంట్లతో పాటు రాజకీయ వేదకలపై ఆయన ఎన్నో మిమిక్రీ కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.