కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ కి 104 స్థానాలు మాత్రమే దక్కడంతో అధికారం కోసం జేడీఎస్ ఎం ఎల్ ఏ లను కొనడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఒక్కో ఎం ఎల్ ఏ కు వంద కోట్ల ఆఫర్ ఇస్తున్నారని అంతేకాదు కేబినెట్ మినిష్టర్ ని కూడా చేస్తామని దిగజారి పోయారని సంచలన ఆరోపణలు చేసాడు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి . ఈరోజు బెంగుళూర్ లో జరిగిన జేడీఎస్ శాసనసభా పక్ష సమావేశంలో కుమారస్వామి ని శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు . శాసనసభా పక్ష ఎన్నిక అనంతరం మీడియాతో మాట్లాడిన కుమారస్వామి బీజేపీ పై సంచలన ఆరోపణలు చేసారు .
మా ఎం ఎల్ ఏ లను లాక్కోవాలని చూస్తే మీ వైపున్న ఎం ఎల్ ఏ లను కూడా మేము లాక్కోవడానికి వెనుకాడేది లేదని సవాల్ విసిరాడు కుమారస్వామి . వాజ్ పాయ్ , అద్వానీ లు విలువైన రాజకీయాలు చేస్తే మోడీ – షా ద్వయం అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారని బ్లాక్ మనీ తో మా శాసన సభ్యుల ని కొనడానికి ట్రై చేస్తున్నారని అందుకే గవర్నర్ ముందు కాంగ్రెస్ – జేడీఎస్ శాసనసభ్యుల పెరేడ్ నిర్వహిస్తామని తెలిపారు కుమారస్వామి .