హీరో రాంచరణ్ కు షాక్ ఇచ్చింది ఎన్నికల సంఘం . ఈరోజు తెలంగాణలో పోలింగ్ కదా ! ఓటు వేద్దామని ఎంతో ఆశగా రెడీ అయ్యాడట అయితే తీరా సమయానికి ఓటర్ లిస్ట్ లో చరణ్ పేరు లేకపోవడంతో షాక్ అయి మళ్ళీ మళ్ళీ వెదికాడట. కానీ ప్రయోజనం లేకుండాపోయింది దాంతో నేను ఎలాగూ ఓటు లేకపోవడంతో ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నానని కానీ మీరు ఓటు హక్కు ఉన్నవాళ్లు మాత్రం ఓటు ని సద్వినియోగం చేసుకోవాలని కోరాడు చరణ్ .
చరణ్ కు ఓటు లేకపోవడంతో చిరంజీవి తన భార్య సురేఖ తో పాటుగా ఇద్దరు కూతుర్లు సుస్మిత , శ్రీజ లను తీసుకొని వెళ్లి ఓటు హక్కుని వినియోగించుకున్నాడు . అయితే చిరంజీవి కాంగ్రెస్ పార్టీ కావడంతో కాంగ్రెస్ గెలుస్తుందా ? అన్న ప్రశ్న ని చిరు ముందుంచితే స్పందించకుండా నిరాకరించాడు . అయితే చిరు కాంగ్రెస్ లో ఉన్నాడు కానీ లేడు అన్నమాట .