Homeటాప్ స్టోరీస్`దృశ్యం` ద‌ర్శ‌కుడి కండీష‌న్ క్రిటిక‌ల్‌!

`దృశ్యం` ద‌ర్శ‌కుడి కండీష‌న్ క్రిటిక‌ల్‌!

Drishyam director Nishikanth kamat helth condition is critical
Drishyam director Nishikanth kamat helth condition is critical

మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ న‌టించిన చిత్రం `దృశ్యం`. సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించ‌డంతో ఈ చిత్రాన్ని ప్ర‌ధాన భార‌తీయ భాష‌ల్లో రీమేక్ చేశారు. అన్ని భాష‌ల్లోనూ ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. తెలుగులో వెంక‌టేష్‌, త‌మిళంలో క‌మ‌ల్ హాస‌న్‌, హిందీలో అజ‌య్ దేవ‌గ‌న్ ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. అజ‌య్‌తో పాటు ఈ చిత్రంలో శ్రియ‌, ట‌బు, ఇషిత ద‌త్తా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. హిందీ లో రీమేక్ చేసిన ఈ చిత్రానికి నిషికాంత్ కామ‌త్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకున్న ద‌ర్శ‌కుడు నిషికాంత్ కామ‌త్ గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఆయ‌న ప‌రిస్థితి క్రిటిక‌ల్‌గా వుంద‌ని తెలిసింది. లివ‌ర్ సంబంధిత స‌మ‌స్య‌తో నిషికాంత్ బాధ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆయ‌న చికిత్స పొందుతున్నారు. డాక్ట‌ర్లు మాత్రం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి అత్యంత ప్ర‌మాద‌క‌రంగా వుంద‌ని వెల్ల‌డించార‌ట.

- Advertisement -

నిషికాంత్ కామ‌త్ కు ద‌ర్శ‌కుడిగా మంచి పేరుంది. మ‌రాఠీ చిత్రంతో 2005లో నేష‌న‌ల్ అవార్డుని సొంతం చేసుకున్నారు. రాకీ హ్యాండ్స‌మ్‌, ఫోర్స్‌, ముంబై మేరీ జాన్ వంటి చిత్రాలతో ద‌ర్శ‌కుడిగా ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ప్ర‌స్తుతం హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ క‌పూర్ హీరోగా `ద‌ర్బ‌దార్‌` పేరుతో ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీ 2022లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All