వెండితెర ఫై గట్టిగా సౌండ్ చేసి లొల్లి లొల్లి చేసిన డీజే టిల్లు..ఇప్పుడు ఆహా లో ఏకంగా సర్వేర్ ఆగిపోయేలా చేసాడు. నిన్నటి (మార్చి 04 ) నుండి డీజే టిల్లు ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘డీజే టిల్లు’ మూవీ స్ట్రీమింగ్ ప్రారంభమైన వెంటనే పెద్ద ఎత్తున వీక్షకులు లాగిన్ అవ్వడంతో కొద్దిసేపు ఆహా ఓటీటీ సర్వర్ కు ఆగిపోయిందట. ఈ లెక్కన చూస్తే సినిమా కోసం ఎంతమంది చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.
గుంటూరు టాకీస్, కల్కి, కృష్ణ అండ్ హిస్ లీల లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు సిద్ధూ జొన్నలగడ్డ.. రీసెంట్ డీజే టిల్లు తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. మాములుగా ఈయన సినిమాలకు కథలు ఈయనే రాసుకుంటుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. కానీ ఆ మూడు సినిమాల కంటే పెద్ద విజయం సాదించింది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా డీజే టిల్లు సినిమాను ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ కంబైన్డ్ గా నిర్మించారు.