Homeటాప్ స్టోరీస్ఆహా లో మార్చి 4 నుండి లొల్లి స్టార్ట్ చేద్దాం అంటున్న డీజే టిల్లు

ఆహా లో మార్చి 4 నుండి లొల్లి స్టార్ట్ చేద్దాం అంటున్న డీజే టిల్లు

DJ Tillu On Aha from March 4th
DJ Tillu On Aha from March 4th

వెండితెర ఫై గట్టిగా సౌండ్ చేసి లొల్లి లొల్లి చేసిన డీజే టిల్లు..ఇప్పుడు ఆహా లో గట్టి రీ సౌండ్ తో వచ్చేస్తున్నాడు. మార్చి 04 నుండి లొల్లి మాములుగా ఉండదంటూ హెచ్చరించాడు. గుంటూరు టాకీస్, కల్కి, కృష్ణ అండ్ హిస్ లీల లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు సిద్ధూ జొన్నలగడ్డ.. రీసెంట్ డీజే టిల్లు తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. మాములుగా ఈయన సినిమాలకు కథలు ఈయనే రాసుకుంటుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. కానీ ఆ మూడు సినిమాల కంటే పెద్ద విజయం సాదించింది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా డీజే టిల్లు సినిమాను ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ కంబైన్డ్ గా నిర్మించారు.

డెబ్యూ డైరెక్టర్ విమల్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 12న రిలీజ్ అయ్యింది. మొదటి రోజు మొదటి ఆట తోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న డీజే టిల్లు..రెండో రోజు నుండి హౌస్ ఫుల్ కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ ఫై విరుచుకపడ్డాడు. యూత్ ఎలాంటి కథ, యాక్టింగ్ కోరుకుంటారో అవన్నీ నిండుగా డీజే టిల్లు లో ఉండడం తో యువత అంత థియేటర్స్ కు పరుగులుపెడుతున్నారు. ప్రస్తుతం మూడో వారంలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇంకా హౌస్ ఫుల్ తో నడుస్తుంది. ఇక ఇప్పుడు ప్రముఖ తెలుగు ఓటిటి ఛానల్ ఆహా లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. మార్చి 04 నుండి ఆహా లో స్ట్రీమింగ్ మొదలుకాబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. మరి థియేటర్స్ డీజే మోత మోగించిన టిల్లు..ఇప్పుడు ఆహాలో ఎలాంటి మోతమోగిస్తాడో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All