శ్రీకాంత్తో యండమూరి వీరేంద్ర నాథ్ నవల` వెన్నెల్లో ఆడపిల్ల` ఆధారంగా `హలో ఐ లవ్ యూ`, శ్రీహరితో `విజయరామరాజు`, పవర్స్టార్ పవన్కల్యాణ్, మీరా జాస్మిన్ జంటగా `గుడుంబా శంకర్` వంటి చిత్రాల్ని రూపొందించిన ప్రముఖ దర్శకుడు వీరశంకర్. ఆయన తండ్రి బైరిశెట్టి సత్యనారాయణ (83) ఈ రోజు (మంగళవారం) ఉదయం వారి స్వగ్రామం తణుకు సమీపంలోని చివటం గ్రామంలో కన్నుమూశారు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయనకు ముగ్గురు కుమారులు వేణుగోపాల్రావు, వెంకటేశ్వరరావు, వీరశంకర్ వున్నారు. ఈ సందర్భంగా తండ్రి నిజాయితీని గుర్తు చేసుకున్న దర్శకుడు వీర శంకర్ మీడియాతో స్పందించారు. మాకు నిజాయితీని, కష్టపడే తత్వాన్ని నేర్పిన మంచి మనిషి ఆయన. చివరి రోజుల్లో క్యాన్సర్ మహమ్మారి కారణంగా బాధని అనుభవించడం మమ్మల్ని కలిచివేసింది` అన్నారు.
మా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి మేము చేసే పోరాటానికి ఆయనే స్ఫూర్తి. నాన్న ఎప్పటికీ మకొక మరపురాని జ్ఞాపకమే అని దర్శకుడు వీరశంకర్ భావోద్వేగానికి లోనయ్యారు.