Homeటాప్ స్టోరీస్తెలంగాణ గాయకుడ్ని తొక్కేసిన రంగస్థలం

తెలంగాణ గాయకుడ్ని తొక్కేసిన రంగస్థలం

director sukumar insulted singer shivanaguluతెలంగాణ జానపద గాయకుడు శివనాగులు ని అడ్డంగా తొక్కేశారు రంగస్థలం చిత్ర బృందం . చరణ్ హీరోగా నటించిన రంగస్థలం చిత్రంలో ” ఈ గట్టునుంటావా ….. ఆ గట్టునుంటావా ”అనే పాట ఉంది అయితే ఆ పాట ని అసలు పాడింది , సిడి లో ఉంది శివనాగులు పాడిన పాటనే ! కానీ చిత్రంలో మాత్రం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట ఉంది దాంతో శివనాగులు ఖంగుతిన్నాడు . శివనాగులు పాడిన పాటని సాంకేతిక కారణాల వల్ల తీసెయ్యాల్సి వచ్చిందే అనుకుందాం అలాంటప్పుడు చేయాల్సింది నేరుగా శివనాగులు కు దర్శకులు సుకుమార్ కానీ , సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ కానీ చిత్ర నిర్మాతలు కానీ సమాచారం అందించాల్సి ఉండే కానీ అలా చేయలేదు తెలంగాణ వాడు కదా అని ఘోరంగా అవమానించి అతడికి సమాచారం ఇవ్వలేదు .

ఇక ఇచ్చిన సమాచారం ఎవరు ఇచ్చారో తెలుసా …… దేవిశ్రీ ప్రసాద్ మేనేజర్ . జానపద గాయకుడే కదా ! అందునా తెలంగాణ వాడు కదా ! అని తక్కువ జాతి వాడు అని చులకన చేసి ఘోరంగా అవమానించారు రంగస్థలం బృందం. సుకుమార్ అండ్ కో శివనాగులు లోని టాలెంట్ ని తొక్కేశారు . ఓ జానపద గాయకుడు సినిమాల్లో రాణిస్తే చూడాలని అతడి స్నేహితులు , బంధువులు ఎంతో ఆశపడి ఉంటారు వాళ్ళ ఆశలన్నీ అడియాసలు చేసి…… తెలంగాణ వాడ్ని నిలువునా తొక్కేసి తమ అహంకారాన్ని ప్రదర్శించారు .

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All