సినీ విమర్శకుడు , దర్శకుడు కే ఎన్ టి శాస్త్రి కన్నుమూశారు . కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కే ఎన్ టి శాస్త్రి నిన్న తుదిశ్వాస విడిచారు . సినీ విమర్శకుడిగా , దర్శకుడిగా , రచయితగా పలు జాతీయ అవార్డులు అందుకున్నాడు కే ఎన్ టి శాస్త్రి . తిలదానం , సురభి ( డాక్యుమెంటరీ ) చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులను అందుకున్నాడు . తెలుగుతో పాటుగా కొన్ని కన్నడ చిత్రాలకు కూడా పనిచేసాడు కే ఎన్ టి శాస్త్రి .
నందితాదాస్ ప్రధానపాత్రలో నటించిన కమిలి చిత్రాన్ని రూపొందించాడు కే ఎన్ టి శాస్త్రి , ఆ సినిమా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు . కమిలి చిత్రానికి విమర్శకుల ప్రశంసలు లభించాయి . కే ఎన్ టి శాస్త్రి మరణంతో తీవ్ర విషాదం నెలకొంది ఆ కుటుంబంలో . పలువురు సినీ ప్రముఖులు కే ఎన్ టి శాస్త్రి మృతి పట్ల తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు .
English Title: Director KNT Sastry passed away