తెలుగులో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్గా పేరు తెచ్చుకున్నారు దిల్ రాజు. బాలీవుడ్లోనూ ఇదే తరహాలో గుర్తింపును సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలుగులో నాని హీరోగా తెరకెక్కి సూపర్హిట్గా నిలిచిన చిత్రం `జెర్సీ`. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్తో కలిసి దిల్ రాజు బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు.
షాహీద్కపూర్ హీరోగా,మృణాల్ థాకూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. చిత్రీకరణ ఆల్ రెడీ స్టార్టయింది. ఇదిలా వుంటే దిల్ రాజు మరో చిత్రాన్ని కూడా రీమేక్ చేస్తున్నారు. వెంకటేష్, వరుణ్తేజ్ కలిసి నటించిన `ఎఫ్2` చిత్రాన్ని బోనీ కపూర్తో కలిసి ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారు. అనీస్ బజ్మీ దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.
ఇదిలా వుంటే మరో తెలుగు హిట్ చిత్రాన్ని కూడా బాలీవుడ్కు తీసుకెళ్లే ప్రయత్నాల్లో వున్నారు. రెబల్ హీరో విశ్వక్సేన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ `హిట్`. ఈ చిత్ర హిందీ రీమేక్ హక్కుల్ని దిల్ రాజు తాజాగా సొంతం చేసుకున్నారని తెలిసింది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రానున్నట్టు తెలిసింది.