దిల్రాజు పార్ట్నర్ బోనీ అదిరింది. ఆయన తొలి ప్రయత్నంగా డిస్ట్రిబ్యూట్ చేసిన `జాతిరత్నాలు` వసూళ్ల వర్షం కురిపిస్తోంది. నవవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై విజవ వంతంగా ప్రదర్శింపబడుతూ వసూళ్ల పరంగా ట్రేడ్ వర్గాలనే విస్మయానికి గురిచేస్తోంది. అమలాపురం నుంచి అమెరికా వరకు ఈ మూవీ భారీ వసూళ్లని రాబడుతోంది.
ఈ చిత్రాన్ని లక్షణ్ నైజామ్, వైజాగ్ ఏరియాల్లో డిస్ట్రిబ్యూట్ చేశారు. తొలిసిరి డిస్ట్రిబ్యూటర్గా రిలీజ్ చేసిన ఈ చిత్రం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అతనికి లాభాల వర్షం కురిపిస్తుండటంతో అతని ఆనందానికి అవధులు లేవంట. ఇంతకీ లక్ష్మణ్ ఎవరు? అనుకుంటున్నారా? స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతో గత 17 ఏళ్లుగా కలిసి ప్రయాణించి ఇటీవల విడిపోయారు ఆ లక్షణే ఈయన.
దిల్ రాజుతో విడిపోయి బ్రిడ్జ్ పేరుతో కన్స్ట్రక్షన్ కంపనీని ప్రారంభించిన ఆయన ఇదే పేరుతో కొత్తగా డిస్ట్రిబ్యూషన్ సంస్థని ప్రారంభించి తొలి ప్రయత్నంగా `జాతిరత్నాలు` చిత్రాన్ని రిలీజ్ చేశారు. తొలి సినిమా బ్లాక్బస్టర్ హిట్ కావడంతో అతని పంట పండింది. ఇప్పటికే వరంగల్ శ్రీను భారీ చిత్రాల్ని ఎగరేసుకుపోతుంటూ దిల్ రాజుకు చెక్ పెడుతున్న వేళ లక్ష్మణ్ రంగంలోకి దిగడం ఆసక్తికరంగా మారింది.