Homeగాసిప్స్త్రివిక్రమ్ మెరుపులకు అంతా సిద్ధమా?

త్రివిక్రమ్ మెరుపులకు అంతా సిద్ధమా?

త్రివిక్రమ్ మెరుపులకు  అంతా సిద్ధమా?
త్రివిక్రమ్ మెరుపులకు అంతా సిద్ధమా?

త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మాటల మాంత్రికుడు అని ఒక పేరుంది. ఈ పేరు త్రివిక్రముడికి ఊరికే రాలేదు. తనదైన శైలిలో సంభాషణలు అటు ఆలోచనాత్మకంగా ఉంటూనే ఇటు సూటిగా గుండెల్లోకి దూసుకుపోతుంటాయి. ఆ మధ్య కొంత త్రివిక్రమ్ శ్రీనివాస్ పెన్ను పవరు తగ్గిందా అనిపించింది కానీ మళ్ళీ అరవింద సమేతతో తిరిగి తన ఫామ్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా మరోసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్, అల వైకుంఠపురములో సినిమాతో తనలోని రచయితను ఉన్నత స్థానంలో నిలబెట్టినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తన పెన్ను పదునును చూపించినట్లు సమాచారం.

ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ లో రెండు డైలాగులు బాగా హైలైట్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్లకు ఎలివేషన్ లా ఉపయోగపడే ఒక డైలాగ్ అయితే షేర్స్ మీద షేర్స్ పడుతున్నాయి. “దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్, ఒకటి నేలకి, రెండోది వాళ్ళకి. అలాంటోళ్ళతో మనకు గొడవేంటి సార్, జస్ట్ సరెండర్ అయిపోవాలంతే”.. ఇంత సింపుల్ డైలాగ్ తో మహిళల గొప్పదనాన్ని చెప్పిన తీరుకి వారు ఫిదా అవుతున్నారు. ఈ డైలాగ్ తో బోలెడన్ని టిక్ టాక్ వీడియోస్ ఇప్పటికే హల్చల్ చేస్తున్నాయి.

- Advertisement -

ఇక “గొప్ప యుద్ధాలన్నీ నా అనుకున్న వాళ్ళతోనే” అన్న డైలాగ్ కూడా చాలా లోతైన భావన కలిగి ఉంది. సినిమాలో చాలా కీలక సందర్భంలో ఈ డైలాగ్ వస్తుందని అర్ధమవుతోంది. అయితే ఈ రెండు డైలాగ్స్ జస్ట్ శాంపిల్ మాత్రమేనని, ఇలాంటివి సినిమాలో చాలా ఉన్నాయని చెబుతున్నారు. రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫుల్ మర్క్స్ స్కోర్ చేసిన చిత్రంగా అల వైకుంఠపురములో నిలుస్తుందని అంటున్నారు.

సంక్రాంతికి పండక్కి పెర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అల వైకుంఠపురములో నిలిచే అవకాశముంది. ఇప్పటికే పాటలు సూపర్ హిట్ అవ్వడంతో చిత్రంపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ – అల్లు అర్జున్ జోడి మరోసారి తెరపై మ్యాజిక్ చేస్తారేమో చూడాలి. జనవరి 12న ఈ సినిమా విడుదల కానున్న విషయం తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All