
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ…. దండుపాళ్యం సిరీస్ లో భాగంగా వచ్చిన చిత్రాలు ఎంతటి సంచలన విజయం సాధించాయో తెలిసిందే. రికార్డు స్థాయి కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. ఇప్పుడిదే సిరీస్ లో భాగంగా దండుపాళ్యం 3 సీక్వెల్ గా రూపొందించాం. దర్శకుడు శ్రీనివాస రాజు కథ, కథనం అద్భుతంగా ఉంటాయి. అద్భుతమైన సన్నివేశాలు మెస్మరైజ్ చేస్తాయి. సహజత్వం కూడిన సన్నివేశాలతో, భావోద్వేగమైన డైలాగులతో ఈ కథ సాగుతుంది. దండుపాళ్యం 3 చిత్ర ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ దండుపాళ్యం సీరిస్ కి ఇదే చివరి పార్టు కావటంతో అసలు క్లైమాక్స్ ఎలా వుండబోతుందో అనే ఆశక్తి అందరిలో వుంది. అందుకే ట్రేడ్ లో విపరీతమైన క్రేజ్ రావటం విశేషం. శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆశిస్సులతో.. సాయి కృష్ణ ఫిల్మ్స్ సమర్పణలో శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా తెలుగు హక్కుల్ని ఫ్యాన్స్ రేట్ తో దక్కించుకున్నాం. త్వరలోనే భారీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా చేయబోతున్నాం. మార్చి 2న వరల్డ్వైడ్గా దండుపాళ్యం 3 చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాం” అన్నారు.
- Advertisement -