బిజేపీ నేత దగ్గుబాటి పురందరేశ్వరి కరోనా వైరస్ సోకినట్టు తెలిసింది. అనారోగ్యానికి గురికావడంతో ఆమె ఇటీవల కోవిడ్ టెస్టులు చేయించుకున్నారట. ఈ టెస్టుల్లో ఆమెకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. కోవిడ్ లక్షణాలు అధికంగా వుండటంతో హైదరాబాద్లోని ఓ ప్రముఖ హాస్పిటల్లో ఆమెకు చికిత్స అందిస్తున్నారట.
బిజెపిలో పదోన్నతి పొందిన నాలుగు రోజుల తరువాత మాజీ ఎంపి దగ్గుబాటి పురందేశ్వరి కోవిడ్కు గురైనట్టు చెబుతున్నారు. ఇటీవలే ఆమెను బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఇంతలోనే ఆమె కరోనా బారిన పడటంతో కుటుంబ సభ్యులతో పాటు ఆమె పార్టీ వర్గాలు ఆందోళనకు గురవుతున్నారు. పార్టీ పదవిని ప్రకటించిన సందర్భంలో దగ్గుబాటి పురంధేశ్వరి స్వగ్రామంలోనే వున్నారట.
విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు, పార్టీ కార్యకర్తలు ఆమెని పరామర్శించడానికి ప్రయత్నించగా ఆమె మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దగ్గుబాటి పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లాల్సి వుందట. ఇంతలోనే ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలడంతో పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురైనట్టు తెలిసింది.