ఎక్కడో చైనాలో గబ్బిళాలని పీక్కుతిన్న చైనీయుడి కారణంగా కరోనా మహమ్మారి బారిన పడి యావత్ ప్రపంచం భయంతో వణికిపోతోంది. ఒక్కడి తప్పు ఇప్పుడు ప్రపంచాన్ని చావు ఒడిలోకి నెట్టేసింది. తప్పు జరిగిన ప్రాంతాన్ని, అక్కడి వారిని ప్రపంచం వదిలేసి స్వియ రక్షణ కోసం లాక్ డౌన్లని పాటిస్తోంది. ఇది ఎక్కడకి పోతుందో సైంటిస్ట్లకు కూడా అంతుచిక్కని విపత్కర పరిస్థితుల్లోకి మనవ సమాజం బలవంతంగా నెట్టివేయబడింది.
దీని నుంచి తప్పించుకోవాలంటే స్వీమ శుభ్రతే ఏకైక మార్గం అంటూ చేతులు కడుక్కోండి.. చేతులు కడుక్కోండి అంటూ ప్రకటనల్ని గుప్పిస్తున్నారు. ఇదిలా వుంటే యావత్ దేశ వ్యాప్తంగా కరోనా మరణాలు, పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఢిల్లీ నిజాముద్దీన్కు వెల్లొచ్చిన వారి కారణంగా ఈ వైరస్ ఊళ్లకు కూడా పాకే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఆరోగ్య శాఖ డోర్ టు డోర్ పరీక్షలు మొదలుపెట్టింది.
ఇందులో భాగంగా తమిళ స్టార్ హీరో, ఇళయదళపతి విజయ్ ఇంట్లో కరోనా పరీక్షలు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల విదేశాలు తిరిగి ఇండియా వచ్చిన వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వైద్యాధికారులు హీరో విజయ్ ఇంట్లోనూ కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం ఇంట్లో ఎవరికీ కరోనా సోకలేదని, అంతా ఆరోగ్యంగానే వున్నారని వైద్యాధికారులు చెప్పడం విశేషం.