సుకుమార్ దర్శకత్వం లో రాంచరణ్ నటించిన రంగస్థలం వివాదంలో చిక్కుకుంది . రంగస్థలం పై అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఈ వివాదం ఆ చిత్ర బృందానికి ఇబ్బంది కలిగించే అంశమే ! ఇంతకీ రంగస్థలం ని చుట్టుముట్టిన వివాదం ఏంటో తెలుసా ……. రంగమ్మా …. మంగమ్మా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు అంటూ సాగే పాటలో ”గొల్లభామ వచ్చి నా గోరు గిల్లుతుంటే ” అనే పదం వివాదాన్ని రాజేసింది .
- Advertisement -
గొల్లభామ అనే మాట యాదవ మహిళలను కించపరిచేలా పాడించారని కాబట్టి వెంటనే ఆ పదాలను తొలగించాలని లేకుంటే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడమే కాకుండా సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు యాదవ సంఘం నేతలు . మరి ఈ వివాదం పై రంగస్థలం చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి .
- Advertisement -