హాట్ భామ రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో కిషోర్ కుమార్ దర్శకత్వంలో శ్రీధర్ రెడ్డి , ఆనంద్ రెడ్డి , ఆర్ కే రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ” వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి . హాస్య నటులు ప్రవీణ్ , మధునందన్ లు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు . మార్చి 15 న ఈ చిత్రం రిలీజ్ అవుతుండటంతో ఆ చిత్ర విశేషాలను వెల్లడించారు ప్రవీణ్ – మధునందన్ లు .
* ఊళ్ళో అందరికీ సమస్యగా మారిన ఇద్దరు ఆవారాగాళ్ళు గా నేను , మధునందన్ నటించాం , ఊళ్లోకి వచ్చిన టీచర్ రాయ్ లక్ష్మి వెంట పడే సమయంలో మమ్మల్ని వాడుకుంటూ ఊళ్ళో ఉన్న సమస్యలను ఎలా ఎదుర్కొనేలా చేసిందనేదే వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి చిత్రమని
అయితే సినిమా మొత్తం నవ్వులతో ఆసక్తికరంగా సాగుతుంది .
కథ విన్నప్పుడే తప్పకుండా హిట్ అవుతుందన్న నమ్మకం కుదిరింది అందుకే ఏమాత్రం అనుమానం లేకుండా ఈ సినిమా చేసాం , అలాగే రేపు రిలీజ్ అయ్యాక కూడా మా నమ్మకం నిజమని ప్రేక్షకులు నిరూపిస్తారన్న నమ్మకం ఉంది .
రాయ్ లక్ష్మి తో మేమిద్దరం చేసిన సన్నివేశాలు సినిమాలో హైలెట్ అవుతాయి , ప్రేక్షకులను నవ్వించడంతో పాటుగా కవ్విస్తాయి కూడా .
తెలుగు సినిమా రంగంలోనే ఎక్కువ మంది కమెడియన్ లు ఉన్నారు . ఎందుకంటే ప్రేక్షకులు వినోద భరితమైన చిత్రాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు కాబట్టే . సినిమాల్లో మేమిద్దరం కలిసి నటించిన చిత్రాలు తక్కువే కానీ అంతకుమించిన ఫ్రెండ్ షిప్ ఉంది కాబట్టి మా మధ్య అలాగే ఇతర నటీనటులతో కూడా మంచి కంఫర్ట్ ఉంది . ప్రతీ హీరోతో కూడా నటించడానికి ఇష్టపడతాం అంతేకాని ప్రత్యేకంగా ఫలానా హీరో అనేం లేదు . కమెడియన్ లు హీరోలుగా సక్సెస్ అయ్యారు అయితే లాంగ్ రన్ లేకపోవడానికి కారణం ఇతర జోనర్ లను ఎంచుకోవడమే ! ఓ కమెడియన్ హీరో అయ్యాడంటే రెండు గంటల పాటు నవ్విస్తాడని ఆశిస్తారు కానీ యాక్షన్ అంటూ ఇతర జోనర్ లను టచ్ చేయడమే ఫెయిల్యూర్స్ కి కారణం అనుకుంటా .
ఫైనల్ గా ……
రెండు గంటల పాటు హాయిగా ప్రేక్షకులను నవ్వించే చిత్రం మా వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి అంటూ సెలవు తీసుకున్నారు ప్రవీణ్ – మధునందన్
English Title : Comedians Praveen and Madhunandan hopes on Raai laxmi