హాస్యనటులు అంటే మనం సినిమాల్లో చూసే కొద్దిపాటి కమెడియన్స్ అని కొట్టిపారెయ్యలేం. ఎందుకంటే ఒక్కోసారి వారి క్యారెక్టర్ సినిమాలో బాగుంటే వారికోసం కూడా వెళ్తాము. అలాంటి హాస్యనటులు కూడా ఈ మధ్య హీరోలుగా తమ అదృష్టాన్ని హీరో వేషాలు వేస్తూ పరీక్షించుకుంటూన్నారు.
మొన్న శ్రీనివాస్ రెడ్డి, ఆలీ.. నేడు గెట్ అప్ శ్రీను, సుడిగాలి సుధీర్, మహేష్ ఆచంట. ఇలా వరుసగా ఒక్కొక్క వారం వీళ్ళ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, కొన్ని సినిమాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. అయితే శ్రీనివాస్ రెడ్డి కథ వేరు. ”గీతాంజలి”, “జయమ్ము నిశ్చయమ్మురా”, “ఆనందో బ్రహ్మ” సినిమాలు ఉదాహరణగా చెప్పుకుంటే బాగా నటించాడు సినిమాని హిట్ చేపించాడు అని చెప్పుకోవచ్చు. వాటి తర్వాత వచ్చిన “జంబ లకిడి పంబ” సినిమా గోరమైన పరాజయాన్ని చిత్ర యూనిట్ అందరికి హెచ్చరించింది. అలా హీరోగా కొంచెం చూసి అడుగులు వేస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి.
అయితే ఇప్పుడు ఏకంగా దర్శక నిర్మాతలుగా మెగా ఫోన్ పెట్టబోతున్నారు. రీసెంట్ గ తన తదుపరి సినిమా పోస్టర్ ని రిలీజ్ చేసారు. ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ అని వైవిధ్యంగా సాగే ఈ సినిమాలో ఇప్పటి తరం కమెడియన్లు అందరూ ఈ సినిమాలో నటిస్తున్నారు అంటే ఇది నిజంగా మంచి వార్త అని అంటున్నారు అతని సన్నిహితులు.
ఫ్లయింగ్ కలర్స్ అనే కొత్త బేనర్ పెట్టి తనే మెగా ఫోన్ పట్టి శ్రీనివాసరెడ్డి తీస్తున్న సినిమా..ఇది వరకి తాను హీరోగా నటించిన జయమ్ము నిశ్చయమ్మురా రచయితగా పని చేసిన పరమ్ సూర్యంశునే ఈ చిత్రానికి కథతో పాటు స్క్రీన్ ప్లే, మాటలు సమకూరుస్తున్నాడు. మంచి రైటర్ సపోర్టుతోనే శ్రీనివాసరెడ్డి మెగా ఫోన్ పట్టినట్లు అర్థమవుతోంది. శ్రీనివాసరెడ్డి కూడా ఓ పాత్ర చేశాడట. ఆ కమెడియన్లందరూ కలిసి ఫ్లయింగ్ కలర్స్ పేరుతో ఓ గ్రూప్ పెట్టి నెలవారీ సమావేశాలు నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. ఆ పేరుతోనే బేనర్ పెట్టి శ్రీనివాసరెడ్డి ఈ సినిమా తీస్తుండటం విశేషం.